ఎదురింటి ఆంటీ వేధింపులు.. పదో ఫ్లోర్ నుంచి దూకేసిన బాలిక.. ఆత్మహత్యకు ముందు అన్నకు ఫోన్ చేసి..

ABN , First Publish Date - 2023-02-10T15:29:45+05:30 IST

రాజస్థాన్‌లోని (Rajasthan) కోటాలో ఓ విద్యార్థిని అపార్ట్‌మెంట్ 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు రెండు గంటల ముందు విద్యార్థిని తన అన్నతో మొబైల్‌ ద్వారా మాట్లాడింది.

ఎదురింటి ఆంటీ వేధింపులు.. పదో ఫ్లోర్ నుంచి దూకేసిన బాలిక.. ఆత్మహత్యకు ముందు అన్నకు ఫోన్ చేసి..

రాజస్థాన్‌లోని (Rajasthan) కోటాలో ఓ విద్యార్థిని అపార్ట్‌మెంట్ 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు రెండు గంటల ముందు విద్యార్థిని తన అన్నతో మొబైల్‌ ద్వారా మాట్లాడింది. పక్క ఫ్లాట్‌లో నివసిస్తున్న ఆంటీ తనను వేధిస్తోందని, చంపేస్తానని బెదిరిస్తోందని ఆ బాలిక తన సోదరుడికి చెప్పింది. అనంతరం తన ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).

కృష్ణ అళ్వార్ అనే బాలిక కోట (Kota)లో ఉంటూ ఇంటర్ చదువుతూ నీట్‌కు కూడా సిద్ధమవుతోంది. తన సోదరితో కలిసి కోటలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆ బాలికకు ఎదుటి ఫ్లాట్‌లో ఉండే కుర్రాడు పరిచయమయ్యాడు. ఇద్దరూ తరచుగా మాట్లాడుకునే వారు. ఆ విషయం ఆ కుర్రాడి తల్లికి తెలిసింది. దీంతో ఆమె కృష్ణ ఫ్లాట్‌కు వచ్చి బెదిరించింది. తన కొడుకుతో మాట్లాడడం మానెయ్యాలని హెచ్చరించింది. దీంతో కృష్ణ ఆ కుర్రాడికి దూరంగా ఉంటూ వచ్చింది. అయినా ఆ కుర్రాడు మాత్రం కృష్ణను వెంబడించేవాడు.

నా భర్తను వదిలేస్తా.. నువ్వూ నీ భార్యను వదిలేయ్.. పెళ్లి చేసుకుందాం.. ప్రేయసి ప్రపోజల్ ఓ రాష్ట్రాన్నే వణికించింది..!

తనతో మాట్లాడాలని వేడుకోవడంతో కృష్ణ ఆ కుర్రాడితో మాట్లాడేది. తను హెచ్చరించినా కృష్ణ దారిలోకి రాలేదని ఆ బాలుడి తల్లి ఆగ్రహం పెంచుకుంది. ఓ వ్యక్తిని తీసుకెళ్లి కృష్ణను చంపేస్తానని బెదిరించింది. తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. రెండు గంటల అనంతరం తన ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-02-10T15:29:47+05:30 IST