మరిది ఫోన్‌లో ఓ వీడియో చూసి వదిన షాక్.. వెంటనే పోలీసులకు కంప్లైంట్.. అసలు విషయమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-05T16:58:37+05:30 IST

ఆ యువతి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తన మరిది మొబైల్ తీసుకుంది.. ఫోన్ పరిశీలిస్తుండగా ఓ షాకింగ్ వీడియో ఆమె కంట పడింది..

మరిది ఫోన్‌లో ఓ వీడియో చూసి వదిన షాక్.. వెంటనే పోలీసులకు కంప్లైంట్.. అసలు విషయమేంటో తెలిస్తే..

ఆ యువతి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తన మరిది మొబైల్ తీసుకుంది.. ఫోన్ పరిశీలిస్తుండగా ఓ షాకింగ్ వీడియో ఆమె కంట పడింది.. వెంటనే ఆ మొబైల్ తీసుకెళ్లి అందులో ఉన్న వీడియోను పక్కింటి మహిళకు చూపించింది.. ఆ వీడియో చూసిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దామోహ్‌లో ఈ ఘటన జరిగింది.

దామోహ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అరవింద్ చౌరాసియా, కౌశల్ కిషోర్ అనే యువకులు మూడేళ్ల క్రితం ఓ దారుణానికి పాల్పడ్డారు (Crime). తమ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక, 10 ఏళ్ల బాలుడిపై అత్యాచారం సాగించారు (Sexual Harassment on Minors). ఈ ఘటన మొత్తాన్ని తమ సెల్‌ఫోన్‌లో బంధించి దాచుకున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మైనర్లను బెదిరించారు. దాంతో ఆ మైనర్లు ఎవరికీ విషయం చెప్పలేదు. ఇక, ఆ విషయం ఎప్పటికీ బయటకు రాదని ఆ యువకులిద్దరూ నిశ్చింతగా ఉన్నారు. మూడ్రోజుల క్రితం అరవింద్ వదిన ఆ మొబైల్‌ను తీసుకుంది.

కడుపునొప్పి అంటున్న కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అక్కడ డాక్టర్ చెప్పింది విని తల్లితో పాటు కూతురు కూడా షాక్.. ఎందుకంటే..

అనుకోకుండా మొబైల్‌లో ఉన్న ఆ వీడియో ఆమె కంటపడింది (Obscene Video in Mobile). ఆ వీడియోలో ఉన్నది తమ పక్కింటి పిల్లలని గుర్తించింది. వెంటనే ఆ మొబైల్‌ను తీసుకెళ్లి వీడియోను ఆ మైనర్ల తల్లికి చూపించింది. షాకైన మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యంగా ఆ వీడియోను చూపించింది. ఐఫ్‌ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే నిందితుల్లో ఒకరైన అరవింద్ చౌరాసియాను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు కూడా నేరం అంగీకరించాడు. మరో నిందితుడు కిషోర్ కోసం గాలిస్తున్నారు. ఆ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేలు నజరానాగా కూడా ప్రకటించారు.

Updated Date - 2023-03-05T16:58:37+05:30 IST