అంత కోపం ఎందుకమ్మా.. ఆరేళ్ల కూతురిని తగలబెట్టిన తల్లి.. ఆమె ఆగ్రహానికి కారణం ఏంటే తెలిస్తే షాక్..

ABN , First Publish Date - 2023-03-01T16:14:50+05:30 IST

ఓ తల్లి క్షణికావేశంలో అత్యంత ఘోరానికి పాల్పడింది.. పట్టరాని కోపంలో ఆరేళ్ల కూతురిపై శానిటైజర్ వేసి తగలబెట్టేసింది.. కూతురు చేసిన చిన్న తప్పును భరించలేకపోయింది..

అంత కోపం ఎందుకమ్మా.. ఆరేళ్ల కూతురిని తగలబెట్టిన తల్లి.. ఆమె ఆగ్రహానికి కారణం ఏంటే తెలిస్తే షాక్..

ఓ తల్లి క్షణికావేశంలో అత్యంత ఘోరానికి పాల్పడింది.. కూతురు చేసిన చిన్న తప్పును భరించలేకపోయింది.. పట్టరాని కోపంలో ఆరేళ్ల కూతురిపై శానిటైజర్ వేసి తగలబెట్టేసింది.. తల్లి తన తప్పు తెలుసుకునే సరికి దారుణం జరిగిపోయింది.. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆ చిన్నారి హాస్పిటల్‌లో మరణించింది.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అలీగఢ్‌కు చెందిన నోటీ సింగ్ తన భార్య ఆశాదేవి, ముగ్గురు పిల్లలతో కలిసి మొహమ్మద్‌పురాలో నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం 5 ఏళ్ల బాలిక వందన ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లింది. ఆటలో భాగంగా పక్కింటి పాపను తోసేసింది. దీంతో ఆ పాప తల్లి వందన తల్లి ఆశకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవ గురించి తెలుసుకున్న ఆశాదేవికి కోపం వచ్చింది. ఆశ తన కూతురిని కొట్టడం ప్రారంభించింది. బయటి పిల్లలతో ఆడుకోకుండా వందనను ఆశా ఎప్పుడూ ఆపేది. అయితే ఆదివారం తన మాట వినకుండా వందన ఆడుకోవడానికి వెళ్లడంతో ఆశ తీవ్ర ఆగ్రహానికి గురైంది.

భర్తకు ఫోన్ చేసి పిజ్జా తెమ్మంది.. భర్త వచ్చి తలుపు తీసి చూసే సరికి షాకింగ్ సీన్.. ఆరు నెలల పాప గురించి వెతకగా..

పట్టరాని కోపంతో వందనపై శానిటైజర్‌ పోసి నిప్పంటించింది (Mother burnt 6-year-old daughter). మంటలు చెలరేగిన వెంటనే వందన పెద్దగా కేకలు వేయడం ప్రారంభించింది. బాలిక గొంతు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంటలు ఆర్పి బాలికను ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వందన చనిపోయింది. ఆశాదేవి పశ్ఛాత్తాపంలో మునిగిపోయి ఎక్కడికో వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశాదేవి కోసం వెతుకుతున్నారు.

Updated Date - 2023-03-01T16:14:50+05:30 IST