భర్తకు ఫోన్ చేసి పిజ్జా తెమ్మంది.. భర్త వచ్చి తలుపు తీసి చూసే సరికి షాకింగ్ సీన్.. ఆరు నెలల పాప గురించి వెతకగా..
ABN , First Publish Date - 2023-03-01T15:52:09+05:30 IST
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) ఇండోర్కు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ మంగళవారం సాయంత్రం తన భర్తకు ఫోన్ చేసి ఆకలిగా ఉంది, పిజ్జా తీసుకురమ్మని అడిగింది.. డ్యూటీ అయిపోగానే భర్త పిజ్జా (Pizza) కొని ఇంటికి వెళ్లాడు.. లోపలికి వెళ్లే సరికి షాకింగ్ సీన్ కనిపించింది..
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) ఇండోర్కు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ మంగళవారం సాయంత్రం తన భర్తకు ఫోన్ చేసి ఆకలిగా ఉంది, పిజ్జా తీసుకురమ్మని అడిగింది.. డ్యూటీ అయిపోగానే భర్త పిజ్జా (Pizza) కొని ఇంటికి వెళ్లాడు.. లోపలికి వెళ్లే సరికి షాకింగ్ సీన్ కనిపించింది.. బెడ్రూమ్లోని ఫ్యాన్కు భార్య ఉరేసుకుని ఉంది.. పక్క గదిలో ఆరు నెలల పాప బొమ్మలతో ఆడుకుంటోంది.. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు (Crime News).
జబల్పూర్కు చెందిన సాక్షి అనే యువతి, ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్ పాఠక్ అనే యువకుడు ఇండోర్లోని ఓ కాల్ సెంటర్లో పని చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఎదురించి ఏడాదిన్నర క్రితం పెళ్లి (Love Marriage) చేసుకున్నారు. వీరికి ఆరు నెలల పాప ఉంది. మంగళవారం సాయంత్రం సాక్షి తన భర్త రాజ్కు ఫోన్ చేసి పిజ్జా కావాలని అడిగింది. రాజ్ ఇంటికి చేరుకునే సరికి కూతురు బయట గదిలో ఆడుకుంటోంది.
పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో కనెక్షన్.. భర్త లేడని ఇంటికి రమ్మంది.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
బెడ్రూమ్లో సాక్షి ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది (Suicide). రాజ్ వెంటనే తన భార్యను కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సాక్షి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ బయటకు రాలేదు. భర్త రాజ్ను పోలీసులు విచారించనున్నారు. అలాగే జబల్పూర్లో నివసిస్తున్న సాక్షి కుటుంబం వాంగ్మూలాలు కూడా తీసుకోనున్నారు.