ఈ పెళ్లి జంట ఎంత చూడముచ్చటగా ఉందో కదూ.. కానీ ఏడాది కూడా కాకముందే ఈ భార్య ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-02-20T18:25:31+05:30 IST

వారిద్దరూ బంధుమిత్రుల మధ్య ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు.. దాదాపు ఎనిమిది నెలలు సంతోషంగా కలిసి కాపురం చేశారు.. భార్య చూపిస్తున్న ప్రేమకు అతడు మురిసిపోయాడు.. ఈ ఏడాది ప్రేమికుల రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.. అంతలోనే..

ఈ పెళ్లి జంట ఎంత చూడముచ్చటగా ఉందో కదూ.. కానీ ఏడాది కూడా కాకముందే ఈ భార్య ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందంటే..

వారిద్దరూ బంధుమిత్రుల మధ్య ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు.. దాదాపు ఎనిమిది నెలలు సంతోషంగా కలిసి కాపురం చేశారు.. భార్య చూపిస్తున్న ప్రేమకు అతడు మురిసిపోయాడు.. ఈ ఏడాది ప్రేమికుల రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.. అంతలోనే ఈ నెల 9వ తేదీన అతడు అదృశ్యమయ్యాడు.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని మొత్తమంతా గాలించారు.. దాదాపు పది రోజులు విచారించి షాకింగ్ ట్విస్ట్ బయటపెట్టారు.. అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భింద్‌లో ఈ ఘటన జరిగింది (Crime News).

భింద్‌కు చెందిన మోనూ చౌధురికి గతేడాది మే నెలలో రాధ అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన ఎనిమిది నెలల తర్వాత మోను ఈ నెల 9వ తేదీన అదృశ్యమయ్యాడు. దీంతో రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మోను అదృశ్యమైన రోజున అతడి ఇంటికి సమీపంలోని సీసీటీవీని చెక్ చేశారు. అతడు రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్టు తెలుసుకున్నారు. స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా చెక్ చేశారు. మోను ఆ రోజు స్టేషన్ లోపలి నుంచి బయటకు వెళ్తుండగా ఓ వ్యక్తి అతడిని అనుసరిస్తున్నట్టు పోలీసులకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులకు ఆ ఫుటేజీని చూపించారు. ఆ వ్యక్తిని రాధ తండ్రి గుర్తుపట్టాడు. తన అల్లుడిని అనుసరిస్తున్న వ్యక్తి పేరు అనురాగ్ అని, అతడు గతంలో తన కూతురిని వేధించేవాడని చెప్పాడు. ఇది విన్న పోలీసులు అనురాగ్‌ను పట్టుకున్నారు.

పెళ్లయిన 12 రోజులకే భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్తకు ఊహించని షాక్.. భార్యను బయట ఉంచి డాక్టర్‌తో మాట్లాడుతోంటే..

అనురాగ్‌ను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. రాధ, అనురాగ్ ప్రేమికులని బయటపడింది (Love Affair). పెళ్లికి ముందు నుంచి వీరు ప్రేమికులని, మోనును రాధ అయిష్టంగా పెళ్లి చేసుకుందని తేలింది. పెళ్లి తర్వాత కూడా అనురాగ్, రాధ కలుసుకునే వారని, ఇద్దరూ కలిసే మోను హత్యకు పథకం వేశారని బయటపడింది (Wife Killed Husband). ఫిబ్రవరి 9వ తేదీన మోను వెంటాడిన అనురాగ్ అతడికి తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి మార్గమధ్యంలో హత్య చేసి శవాన్ని కాల్చేసినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనురాగ్‌ను, రాధను హత్య కేసు కింద అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-02-20T18:25:33+05:30 IST