పెళ్లయిన 12 రోజులకే భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్తకు ఊహించని షాక్.. భార్యను బయట ఉంచి డాక్టర్‌తో మాట్లాడుతోంటే..

ABN , First Publish Date - 2023-02-20T15:03:11+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. గుణకు చెందిన ఓ వ్యక్తికి 12 రోజుల క్రితం వివాహమైంది. భార్యకు ఒంట్లో బాగోలేకపోతే అతడు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

పెళ్లయిన 12 రోజులకే భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్తకు ఊహించని షాక్.. భార్యను బయట ఉంచి డాక్టర్‌తో మాట్లాడుతోంటే..

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. గుణకు చెందిన ఓ వ్యక్తికి 12 రోజుల క్రితం వివాహమైంది. భార్యకు ఒంట్లో బాగోలేకపోతే అతడు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అతడు హాస్పిటల్‌లో డాక్టర్‌తో మాట్లాడుతుండగా అతడి భార్యను వేరే వ్యక్తి బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లిపోతున్నాడు.. గమనించిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి బైక్ ఆపి అడగ్గా ఊహించని షాక్ తగిలింది. చివరకు విషయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది (Crime News).

గుణ జిల్లా సారంగపూర్‌కు చెందిన విష్ణుప్రసాద్ మేఘ్‌వాల్ (28)కి రెండు వారాల క్రితం 25 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. రజనీకాంత్ అనే వ్యక్తి విష్ణు నుంచి రూ.1.30 లక్షలు తీసుకుని ఆ వివాహం కుదిర్చాడు. ఫిబ్రవరి 8న అశోక్‌నగర్‌లో ఇద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత విష్ణు తన భార్యతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. భార్యకు జర్వం వచ్చినట్టు ఉండడంతో శనివారం ఉదయం ఆమెను విష్ణు స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. భార్యను కూర్చోబెట్టి విష్ణు డాక్టర్‌తో మాట్లాడుతుండగా అక్కడకు రాజేష్ సహారియా అనే వ్యక్తి వచ్చాడు. రాజేష్ రమ్మనగానే విష్ణు భార్య ఆ బైక్ ఎక్కి కూర్చుంది. బైక్‌పై వెళ్లిపోతున్న వారిద్దరినీ చూసిన విష్ణు వెంబడించి పట్టుకున్నాడు. తన భార్యను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగాడు (Husband and Wife).

పెళ్లి తర్వాత కూడా కలిసే ఉందామన్న ప్రియుడు.. అడ్డు చెప్పిన మైనర్ బాలిక.. చివరకు ఆ యువకుడు ఎంత పని చేశాడంటే..

ఆమె తన భార్య అని, మూడేళ్ల క్రితమే తమకు వివాహం జరిగిందని రాజేష్ చెప్పడంతో విష్ణు షాకయ్యాడు. రోడ్డుపైనే ఇద్దరూ ఆమె తన భార్య అంటే, తన భార్య అని గొడవ పడ్డారు. ఆ మహిళ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. దీంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అసలు విషయమేమిటంటే.. రాజేష్‌కు, ఆ మహిళకు మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. నెల రోజుల క్రితం రాజేష్ కూలి పని కోసం ఢిల్లీ వెళ్లాడు. ఈ లోపు మధ్యవర్తి రజనీకాంత్ ద్వారా ఆ మహిళకు ఓ డీల్ వచ్చింది. విష్ణును పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే రూ.70 వేలు ఇస్తానని రజనీకాంత్ ఆశ పెట్టడంతో ఆమె అంగీకరించింది. అయితే భర్త వెంటనే తిరిగి వచ్చేయడంతో ఆమె ప్లాన్ రివర్స్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను, రజినీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-02-20T15:03:13+05:30 IST