BJP leader: ఈ బీజేపీ నేత మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-06-01T10:46:00+05:30 IST
స్థానిక విల్లివాక్కంకు చెందిన ఓ మహిళ వద్ద రూ.45 లక్షల దోపిడీ కేసులో బీజేపీ చేనేత కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మింట్ రమేష్(Mi
ప్యారీస్(చెన్నై): స్థానిక విల్లివాక్కంకు చెందిన ఓ మహిళ వద్ద రూ.45 లక్షల దోపిడీ కేసులో బీజేపీ చేనేత కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మింట్ రమేష్(Mint Ramesh0ను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు, కొరట్టూరులో ఉన్న 78 సెంట్ల స్థలాన్ని విక్రయించేందుకు నిర్ణయించిన నారాయణి... బీజేపీ నాయ కుడు రమేష్ను ఆశ్రయించారు. అయితే గత నెల మరో వ్యక్తికి ఆ స్థలాన్ని విక్రయించిన నారాయణిపై ఆగ్రహం చెందిన మింట్ రమేష్ తన మిత్రుడు మహేష్తో కలసి ఆమె ఇంట్లో చొరబడి రూ.45 లక్షలు దోచుకొని పరారైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కొరట్టూరు పోలీసులు, మంగళవారం రాత్రి మింట్ రమేష్, మహేష్ను అరెస్టు చేశారు.