YSRCP : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఎంపీ పిల్లి పరోక్షంగా తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2023-07-16T20:46:02+05:30 IST

కాకినాడ పట్టణ నియోజకవర్గం వైసీపీ (YCP) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై (Dwarampudi Chandrasekhar Reddy) వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

YSRCP : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఎంపీ పిల్లి పరోక్షంగా తీవ్ర విమర్శలు

కాకినాడ: కాకినాడ పట్టణ నియోజకవర్గం వైసీపీ (YCP) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై (Dwarampudi Chandrasekhar Reddy) వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కాకినాడలో మల్లాడి కృష్ణారావు పుట్టిన రోజు కట్టిన ఫ్లెక్సీ‌లు చింపడం ఆయనకు జరిగిన అవమానం కాదని, మన జాతికి జరిగిన అవమానం అని మండిపడ్డారు.

కాకినాడలో అది చూసి కొందరు తట్టుకోలేకపోయారని, బీసీలు అంత చేతగాని వారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పోకడలు, చేష్టలు మళ్లీ చేస్తే అంతకు పది రెట్లు స్పందిస్తామని హెచ్చరించారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు.

Updated Date - 2023-07-16T21:41:52+05:30 IST