West Godavari Dist.: ‘ఒక్క క్షణం కూడా జగన్‌లా బతకాలని లేదు’

ABN , First Publish Date - 2023-07-02T13:53:10+05:30 IST

ప.గో.జిల్లా: ఒక్క క్షణం కూడా సీఎం జగన్‌లా బతకాలని తమకు లేదని పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు అన్నారు. భీమవరం ఎమ్మెల్యేకు ఒక బాధ ఉందని, పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఆయన పేరు రాలేదనే బాధ ఉందన్నారు.

West Godavari Dist.: ‘ఒక్క క్షణం కూడా జగన్‌లా బతకాలని లేదు’

ప.గో.జిల్లా: ఒక్క క్షణం కూడా సీఎం జగన్‌ (CM Jagan)లా బతకాలని తమకు లేదని పశ్చిమగోదావరి జిల్లా జనసేన (Janasena) అధ్యక్షుడు గోవిందరావు (Govindarao) అన్నారు. భీమవరం ఎమ్మెల్యేకు ఒక బాధ ఉందని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నోటి నుంచి ఆయన పేరు రాలేదనే బాధ ఉందన్నారు. ఆయన నోటి నుంచి పేరు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ వస్తుందని చాలామంది చూస్తారని అన్నారు.

ఈ సందర్బంగా ఆదివారం భీమవరంలోని గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పవన్ వారాహి సభ (Varahi Sabha) విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సభ సూపర్ సక్సెస్ అయిందని, వైసీపీ గాలి పూర్తిగా పోయిందన్నారు. వారాహి యాత్ర మొదలయ్యాక వైసీపీ నాయకులు నోటికి సైలెన్సర్లు బిగించుకున్నారని, వైసీపీ నాయకులకు సంస్కారం వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. రెండు రోజుల్లో సెకండ్ షెడ్యూల్ విడుదల అవుతుందన్నారు. యాత్ర భీమవరం నుంచి కొనసాగుతుందన్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గ నాయకులను రెండు రోజుల పాటు పవన్ కలుస్తారని, రానున్న రోజుల్లో భీమవరంలో జనసేన విజయం ఆకాశం అంత ఉంటుందన్నారు. 20 కేసులు సీబీఐ కోర్టుకు రాగానే అక్రమ సంబంధాలను కలవడానికి ఈనెల 5వ తేదీన సీఎం జగన్ కోర్టుకు వెళ్లనున్నారని గోవిందరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-02T13:53:10+05:30 IST