CM Jagan: మరోసారి పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సీఎం జగన్

ABN , First Publish Date - 2023-06-28T16:26:16+05:30 IST

పార్వతీపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి విమర్శలు చేశారు. బుధవారం పార్వతీపురం జిల్లా, కురుపాంలో జరిగిన జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో జగన్ తన ఆవేదనను బయటపెట్టారు.

CM Jagan: మరోసారి పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సీఎం జగన్

పార్వతీపురం: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను సీఎం జగన్ (CM Jagan) వ్యక్తిగతంగా టార్గెట్ (Target) చేశారు. ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి విమర్శలు చేశారు. బుధవారం పార్వతీపురం జిల్లా, కురుపాంలో జరిగిన జగనన్న అమ్మఒడి (Jagananna Ammaodi) కార్యక్రమంలో జగన్ తన ఆవేదనను బయటపెట్టారు. నాలుగు పెళ్లిళ్లు అంటూ పవన్‌పై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌ అంటూ ఆరోపణలు చేశారు. అయితే విద్యార్థుల ముందు ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారాహి అనే లారీ ఎక్కి పవన్ పూనకంతో ఊగిపోతున్నారని, మాట్లాడితే చెప్పుతో కొడతా, తాట తీస్తా అంటున్నారని, ఆ మనిషికి నిలకడ లేదు.. ఆయన నోటికి అదుపులేదని జగన్‌ దుయ్యబట్టారు. దత్తపుత్రుడిలా పూనకం వచ్చినట్లు మనం మాట్లాడలేమని, వాళ్లలా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని భార్యలను వదిలేయలేమని అన్నారు. పెళ్లి అనే బంధాన్ని రోడ్లపైకి తీసుకురాలేమని, ఇలాంటివన్నీ దత్తపుత్రుడికే పేటెంట్‌ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం మంచిచేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని, మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని, కడుపు మంట, ఈర్ష్యతో వారి కళ్లు మూసుకుపోయాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పవన్‌ను గతంలో కూడా పెళ్లిళ్ల గురించి వ్యక్తిగతంగా ప్రస్తావించినప్పటికీ ఇవాళ డైరెక్టుగా సీఎం అటాక్ చేశారు. పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న వారాహి యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైసీపీ వర్గాలు జీర్ణించికోలేకపోతున్నాయి.

Updated Date - 2023-06-28T16:26:16+05:30 IST