Share News

Bopparaju Venkateswarlu: మున్సిపల్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:41 PM

మున్సిపల్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని.. ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని అమరావతి జేఏసీ.. అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswarlu ) డిమాండ్ చేశారు.

Bopparaju Venkateswarlu: మున్సిపల్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విశాఖపట్నం: మున్సిపల్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని.. ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని అమరావతి జేఏసీ.. అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswarlu ) డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగులకు కార్పొరేషన్ క్యాడర్స్ స్టెంత్ ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రకాల కార్పొరేషన్ ఏకం చేసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జనవరి 7వ తేదీన రాష్ట్ర ప్రథమ మహాసభ విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ రూల్స్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధంగా ఇది పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని మాటలు చెబుతుందే కాని అమలు చేయడం లేదని మండిపడ్డారు. వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ ఉప సంఘం వేసి చర్చలకు పిలవాలని.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని..ఉద్యోగులు అన్ని గమనిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 09:41 PM