AP News: పార్వతీపురం జిల్లాలో గర్భంతో ఉన్న జింక మృతి

ABN , First Publish Date - 2023-06-30T10:19:04+05:30 IST

జిల్లాలోని కొమరాడ మండలం కేంద్రం సమీపంలో గర్భంతో ఉన్న జింక మృతి చెందింది.

AP News: పార్వతీపురం జిల్లాలో గర్భంతో ఉన్న జింక మృతి

పార్వతీపురం మన్యం: జిల్లాలోని కొమరాడ మండలం కేంద్రం సమీపంలో గర్భంతో ఉన్న జింక మృతి చెందింది. ఓ తోటలో జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ అధికారులు అక్కడకు చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే జింకలు గుంపులుగా వచ్చే క్రమంలో గాయాలు జరిగి మృతిచెంది ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. జింక గర్భంలో ఉన్న 6 నెలల పిల్ల కూడా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పశువైద్యాధికారి, అటవీశాఖ అధికారులు కలిసి జింక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.

Updated Date - 2023-06-30T10:19:04+05:30 IST