Share News

Minister Rajini: విశాఖ కేజీహెచ్‌లో రూ. 16 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి విడదల రజిని

ABN , First Publish Date - 2023-10-21T19:26:03+05:30 IST

విశాఖ కేజీహెచ్‌లో చేపట్టిన రూ. 16 కోట్ల అభివృద్ధి పనుల మంత్రి విడదల రజిని ప్రారంభించారు.

Minister Rajini: విశాఖ కేజీహెచ్‌లో రూ. 16 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి విడదల రజిని

విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్‌లో చేపట్టిన రూ. 16 కోట్ల అభివృద్ధి పనుల మంత్రి విడదల రజిని ప్రారంభించారు.

"ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. గతంలో పోల్చుకుంటే ఇక్కడ రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది. వసతులు పెరిగాయి. ఇక్కడకి వచ్చేవారికి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో రూ. 16 వేల కోట్ల అభివృద్ధి జరగుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు తీసుకువస్తున్నాం. ఆరోగ్యశ్రీలో వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. ప్రతిపక్షాలు, చంద్రబాబునాయుడు హయాంలో చేసింది ఏమి లేదు. కనీసం మరమత్తులు కూడా చేయలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా అనారోగ్య శ్రీగా మార్చేశారు. కేజీహెచ్‌తో పాటు విమ్స్ కూడా సమగ్ర అభివృద్ధికి నివేదిక తయారు చేస్తున్నాం." అని మంత్రి విడదల రజిని అన్నారు.

Updated Date - 2023-10-21T19:26:03+05:30 IST