AP: విశాఖ చేరుకున్న విశాఖ - వారణాసి ఎక్స్ప్రెస్.. రేపటి నుంచి తొలి సర్వీసు ప్రారంభం
ABN , First Publish Date - 2023-11-21T20:35:38+05:30 IST
విశాఖ - వారణాసి ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం చేరుకుంది. రేపు ఉదయం 4 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం నుంచి తొలి సర్వీసు ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్లో ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు.

విశాఖపట్నం: విశాఖ - వారణాసి ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం చేరుకుంది. రేపు ఉదయం 4 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం నుంచి తొలి సర్వీసు ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్లో ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ నుంచి వారణాసికి నేరుగా ప్రయాణించే రైలు కావాలన్న కోరిక నెరవేరడంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది. వారణాసి రైలు రేపు ఉదయం విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రస్తుతానికి వారానికి 2 రోజు ఈ రైలు ప్రయాణిస్తుంది. డిమాండ్ను బట్టి సర్వీసును 2 రోజుల నుంచి 5 రోజుల వరకు పెంచే ప్రయత్నం చేస్తాం." అని ఎంపీ జీవీఎల్ అన్నారు.