Supreme Court: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

ABN , First Publish Date - 2023-01-05T15:58:24+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (Y.S Vivekananda Reddy) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy) బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది.

Supreme Court: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (Y.S Vivekananda Reddy) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy) బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది. ఇరు వాదనలు విన్నన్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో ఏ1గా ఎర్ర గంగిరెడ్డి ఉన్నాడు. డీఫాల్డ్ బెయిల్‌పై గంగిరెడ్డి బయటకు వచ్చాడు. సీబీఐ (CBI) తరపున సీనియర్ కౌన్సిల్ నటరాజన్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు వాదించారు. డీఫాల్డ్ బెయిల్‌పై బయటకు వచ్చిన గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. గంగిరెడ్డికి గతంలో సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దాన్ని రద్దు చేయాలని సీబీఐ తొలుత హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. హైకోర్టు సీబీఐ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - 2023-01-05T16:02:15+05:30 IST