Lokesh: గర్నరర్‌ను కలిసిన లోకేశ్.. గంజాయి లభ్యతపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-07-15T11:48:11+05:30 IST

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శనివారం ఉదయం భేటీ అయ్యారు.

Lokesh: గర్నరర్‌ను కలిసిన లోకేశ్.. గంజాయి లభ్యతపై ఫిర్యాదు

అమరావతి: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో (AP Governor Abdul Nazeer) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (TDP Leader Nara Lokesh) శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై గవర్నర్‌కు యువనేత ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో లోకేశ్ భేటీ ఇదే తొలిసారి. ఏపీ గంజాయి రాష్ట్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో రాష్ట్రం ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంటూ మహిళలు, యువనేత లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గవర్నర్‌ను కలిసి లోకేశ్.. గంజాయికి సంబంధించిన వివరాలను సీడీ, పెన్‌ డ్రైవ్ రూపంలో గవర్నర్‌కు ఇచ్చారు. లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు మండల చైర్మన్ షరీఫ్, కొల్లు రవీంద్ర.. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు అనంతరం లోకేశ్ తిరిగి యువగళం పాదయాత్రకు బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - 2023-07-15T11:48:11+05:30 IST