Yanamala: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ దుర్మార్గం

ABN , First Publish Date - 2023-09-19T12:51:18+05:30 IST

టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yanamala: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ దుర్మార్గం

అమరావతి: టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుళ్లు, మసీదులు, చర్చిల్లో ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం మత విశ్వాసాలను అవమానించడమే అని అన్నారు. జగన్ రెడ్డి (CM Jagan) పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా? అని ప్రశ్నించారు. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని అన్నారు. ప్రజల మనిషి చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష కట్టారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-19T12:51:18+05:30 IST