Budda venkanna: చంద్రబాబును చంపేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా.. తమ్మినేనిపై బుద్దా వెంకన్న ఫైర్

ABN , First Publish Date - 2023-06-02T13:24:45+05:30 IST

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినేని సీతారాం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

Budda venkanna: చంద్రబాబును చంపేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా.. తమ్మినేనిపై బుద్దా వెంకన్న ఫైర్

అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై (Speaker Tammineni Sitaram) టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినేని సీతారాం చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు వద్ద 9 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ అంటే అసెంబ్లీలో టీచర్ మాత్రమే అని... చంద్రబాబును చంపేస్తాం సెక్యూరిటీ తీసేస్తాం అంటే చూస్తూ కూర్చుంటామా అని అన్నారు. తమ్మినేని సీతారాంకు దమ్ముంటే తాను చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోమనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా వైసీపీలోనే ఊర కుక్కలు ఉన్నాయని అనుకున్నామని.. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఉన్నాయని తెలుస్తోందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

నాకు చంద్రబాబు అన్యాయం చేయరు..

తాను అనకాపల్లిలో పోటీ చేస్తానని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తాను విజయవాడ పశ్చిమలోనే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీలలో ఒక సీటు బీసీలకు ఇవ్వాలని.. ఖచ్చితంగా తనకు పశ్చిమ ఇస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘చంద్రబాబు కోసం నేను ప్రాణాలకు తెగించి నిలబడ్డా.. నాకు చంద్రబాబు అన్యాయం చేయరు. వేరేచోట పోటీ చేయమని చంద్రబాబు ఆదేశిస్తే ఆయన మాట వింటాను. కేశినేని నాని గురించి నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఆయన సంగతి హైకమాండ్ చూసుకుంటది. కేశినేని నాని చంద్రబాబుని ఉద్దేశించి ఏమీ అనలేదు. చంద్రబాబును విమర్శిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను’’ అని అన్నారు. లోకేష్ పాదయాత్ర శంకరాభరణం సినిమా లా బద్దలు కొట్టేసిందని అన్నారు. ఆనాడు చంద్రబాబు పాదయాత్ర కన్నా ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు జనం భారీగా వస్తున్నారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఉన్న ఇంటికి నోటీసులు ఇవ్వవచ్చు.. బుల్డోజర్లతో గుద్దించవచ్చు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి మీదకు వస్తే ముఖ్యమంత్రి అయినా సరే జగన్ ఇంటి మీదకు వెళ్తామని హెచ్చరించారు. చంద్రబాబు మీదకి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. జైల్లో పెట్టి ఎన్‌కౌంటర్‌ చేసిన ఆగేది లేదన్నారు. చంద్రబాబు గురించి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-02T13:24:45+05:30 IST