NTR Rs.100 Coin Launch: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు

ABN , First Publish Date - 2023-08-28T11:02:10+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

NTR Rs.100 Coin Launch: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు

న్యూఢిల్లీ: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (TDP National President Nara Chandrababu Naidu) కాసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్‌కు (Rashtrapati Bhavan) చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల (NTR Rs. 100 Coin Launch) కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ రూ.100 నాణాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి (Daggubati Purandeshwari), దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ (Actor Balakrishna), నారా బ్రాహ్మణి (Nara Brahmini), ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు (NTR Family) రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, బాలకృష్ణ, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - 2023-08-28T11:06:24+05:30 IST