YCP: సత్తెనపల్లి వైసీపీలో అసమ్మతి రాగం.. అంబటి ఒంటెద్దు పోకడపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-07-19T17:10:56+05:30 IST

అంబటి రాంబాబు ఒంటెద్గు పోకడపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

YCP: సత్తెనపల్లి వైసీపీలో అసమ్మతి రాగం.. అంబటి ఒంటెద్దు పోకడపై ఆగ్రహం

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి వైసీపీలో (Sattenapalli YCP) అసమ్మతి రాగం తలెత్తింది. మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) వ్యతిరేకంగా వైసీపీ నేతలు సమావేశమయ్యారు. వైసీపీ నేత చిట్టా విజయ బాస్కర్ రెడ్డి ఇంట్లో వైసీపీ నేతలు సమావేశమై స్థానికంగా ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.


అంబటి రాంబాబు ఒంటెద్గు పోకడపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు కూడా అంబటిని కలిసే అవకాశం ఉండటం లేదని తమ ఆవేదనను వెలుబుచ్చారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-07-19T17:11:04+05:30 IST