Somu Veerraju: జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2023-03-15T20:40:00+05:30 IST

రాష్ట్ర రాజధాని అమరావతి కాబట్టే ఈ ప్రాంత అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని, రాజధాని విషయంలో బీజేపీ నిర్ణయం ఒక్కటేనని

Somu Veerraju: జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధం: సోము వీర్రాజు

గుడివాడ: రాష్ట్ర రాజధాని అమరావతి కాబట్టే ఈ ప్రాంత అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని, రాజధాని విషయంలో బీజేపీ నిర్ణయం ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై దృష్టికి పెట్టడం వల్లే రూ.3లక్షల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. జనసేన (Janasena)తో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కుటుంబపాలనకు బీజేపీ (BJP) వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో సీఎం జగన్‌ (CM Jagan) 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 14, 15వ ఆర్థిక సంఘాల నుంచి రూ.10వేల కోట్లు విడుదల అయ్యాయని, ఉపాధి హామీ నిధులతో 30వేల కుటుంబాలు ఆర్థిక ఆసరాను పొందాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అసహాస్యం చేశారని, దొంగ ఓట్లు చేర్చడంతో వైసీపీ నిజస్వరూపం బయటపడిందని సోము వీర్రాజు దుయ్యబట్టారు.

Updated Date - 2023-03-15T20:40:00+05:30 IST