Share News

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

ABN , First Publish Date - 2023-11-05T15:43:22+05:30 IST

సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు.

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పాలకొల్లు(Paalakollu)లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కళ్లు తెరిపించేలా ఈ నెల 15న పాలకొల్లులో టిడ్కో ఇళ్లు(TIDCO houses) పేదలకు అందజేస్తామని చెప్పారు. సెంటు భూమి లబ్ధిదారులతో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. టీడీపీ హయాంలో 90 శాతం టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయని ఆయన స్పష్టం చేశారు. మిగతా పనుల్ని పూర్తి చేసి వైసీపీ ప్రభుత్వం పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని నిమ్మల ఆరోపించారు. వారందరికి న్యాయం జరిగే వరకు టీడీపీ(TDP) పోరాడుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-05T15:43:23+05:30 IST