TDP Protest: కందుకూరులో టీడీపీ శ్రేణుల నిరసన

ABN , First Publish Date - 2023-01-06T13:52:41+05:30 IST

జిల్లాలోని కుందుకూరులో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు.

TDP Protest: కందుకూరులో టీడీపీ శ్రేణుల నిరసన

నెల్లూరు: జిల్లాలోని కుందుకూరులో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. కందుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రాజేష్ అరెస్టును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా జీవో నెంబర్ 1 ప్రతులు దగ్థం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అజీజ్ భాషా, కందుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ నాగేశ్వరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-06T13:52:43+05:30 IST