AP Politics: ప్రభుత్వ పాఠశాల వేదికగా ఆనం, నేదురుమల్లి బలప్రదర్శన

ABN , First Publish Date - 2023-01-23T14:40:35+05:30 IST

రాపూరు ప్రభుత్వ పాఠశాల వేదికగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నేదురుమల్లి బలప్రదర్శనకు దిగారు.

AP Politics: ప్రభుత్వ పాఠశాల వేదికగా ఆనం, నేదురుమల్లి బలప్రదర్శన

నెల్లూరు: రాపూరు ప్రభుత్వ పాఠశాల వేదికగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), నేదురుమల్లి (Nedurumalli) బలప్రదర్శనకు దిగారు. రాపూరు జడ్పి పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలకు ఆనం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఈ మధ్యే పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా... నేదురుమల్లి ఆదేశాలతో స్కూల్ ఆవరణం మట్టితో లెవల్ చేస్తున్న వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కూల్ ఆవరణంలో ఎటువంటి ఆటలు నిర్వహించరాదంటూ స్కూల్ ఉపాధ్యాయులకు నేదురుమల్లి వర్గం సూచించింది. దీంతో ఆనం రంగంలోకి దిగారు. జిల్లా కలెక్టర్‌కు స్వయంగా ఫోన్ చేయగా.. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వాహనాలను విడిచిపెట్టారు. ఆపై ఆనం వర్గం దగ్గరుండి మరీ స్కూల్ ఆవరణంలో గ్రిక్స్ ఏర్పాట్లు చేయిస్తున్నారు.

Updated Date - 2023-01-23T14:40:37+05:30 IST