Share News

Nara Lokesh: మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లను గజదొంగ జగన్

ABN , First Publish Date - 2023-11-29T12:52:02+05:30 IST

డ్వాక్రా మహిళలు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లను గజదొంగ జగన్ దోచుకున్నారన్నారు.

Nara Lokesh: మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లను గజదొంగ జగన్

కాకినాడ: డ్వాక్రా మహిళలు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లను గజదొంగ జగన్ దోచుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్థిక తోడ్పాటునందిస్తామని నారా లోకేష్ తెలిపారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. పాడైపోయిన రోడ్లను బాగుచేయించి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చేస్తామన్నారు. రాష్ట్ర యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహిళలు, యువత రక్షణకు కల్పించే చర్యలను విస్తృతంగా చేపడతామని నారా లోకేష్ తెలిపారు.

Updated Date - 2023-11-29T12:52:04+05:30 IST