Nara Lokesh: ఏమ్మా భారతీ రెడ్డి తప్పుడు సాక్షి పత్రికకు సిగ్గు అనేది లేదా?
ABN , First Publish Date - 2023-11-29T09:24:38+05:30 IST
తన సన్నిహితుడికి జగన్ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? అని ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ‘ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు.
![Nara Lokesh: ఏమ్మా భారతీ రెడ్డి తప్పుడు సాక్షి పత్రికకు సిగ్గు అనేది లేదా?](https://media.andhrajyothy.com/media/2023/20231102/LOKESH_3a9349c7b3.jpg)
అమరావతి : తన సన్నిహితుడికి జగన్ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? అని ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ‘ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు వైసీపీ పాలనలో టీడీపీ బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు మెంబర్ చెయ్యాలని కరకట్ట కమల్ హాసన్ సిఫార్సు చేశారా? అని నారా లోకేష్ నిలదీశారు. ‘ఇక డ్రామాలు కట్టిపెట్టు కరకట్ట కమల్’ అంటూ హెచ్చరించారు. టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య మాట్లాడింది నూటికి నూరుశాతం నిజమని.. అందుకు ఆయనను తాను అభినందిస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.