Nara Lokesh : కుర్చీలు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దగా చేశారు
ABN , First Publish Date - 2023-03-27T11:45:54+05:30 IST
వడ్డెర సామాజిక వర్గీయులు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కలిశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.
శ్రీసత్యసాయి : నేడు యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh).. వడ్డెర సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం (Jagan Government) అన్యాయం చేసిందన్నారు. వడ్డెర వృత్తి చేసుకునేందుకు గతంలో కేటాయించిన.. క్వారీలను సైతం వైసీపీ నేతలు కబ్జా చేశారని నారా లోకేశ్ పేర్కొన్నారు. కుర్చీలు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దగా చేశారన్నారు. అధికారంలోకి రాగానే వడ్డెరలకు పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. క్వారీలను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పథకం కింద వడ్డెరలకు పనులు కేటాయిస్తామని లోకేశ్ వెల్లడించారు.