MLA Prasanna kumar Reddy: 3 గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే జగన్ గజగజ వణుకుతున్నాడా?

ABN , First Publish Date - 2023-03-25T10:58:05+05:30 IST

మూడు గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే ఏపీ సీఎం జగన్ గజగజ వణుకుతున్నాడా? అని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు.

MLA Prasanna kumar Reddy: 3 గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే జగన్ గజగజ వణుకుతున్నాడా?

నెల్లూరు : మూడు గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే ఏపీ సీఎం జగన్ గజగజ వణుకుతున్నాడా? అని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరికి రూ.10 కోట్ల లెక్కన డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నావని... వాళ్లని తమ పార్టీ సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. మీ టీడీపీ నుంచి పక్కకి వచ్చిన వారిని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. వరుస ఓటములతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి భయం పట్టుకుందని, ఈ భయంతో వచ్చే నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపడనక్కరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-03-25T10:58:05+05:30 IST