Amaravati: ఏపీలో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల ఏర్పాటుకు నేడు ఒప్పందం
ABN , First Publish Date - 2023-08-23T11:38:56+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల ఏర్పాటుకు సిఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఒప్పందం జరగనుంది. ఏపీ జెన్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఎన్హెచ్పీసీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (Pumped Storage Project)ల ఏర్పాటుకు సిఎం జగన్ (CM Jagan) ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఒప్పందం జరగనుంది. ఏపీ జెన్కో (AP Genco) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఎన్హెచ్పీసీ (NHPC) సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయన్నారు. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగావాట్లు.. అనంతపురం జిల్లా కమలపాడులో 1950 మెగావాట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ను సైతం ఏర్పాటు చేయనున్నారు. రెండు పిఎస్పీలకు సంబంధించి ఏపీ జెన్కో, ఎన్హెచ్పీసీలు.. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddi Reddy) సమక్షంలో సంతాకాలు చేయనున్నారు.