9 నుంచి 12 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు

ABN , First Publish Date - 2023-02-08T08:30:37+05:30 IST

గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

9 నుంచి 12 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ : గుణదల మేరీ మాత (Gunadala Merimatha) ఉత్సవాల సందర్భంగా విజయవాడ (Vijayawada) నగరంలో ట్రాఫిక్ ఆంక్షల (Traffic Rules)ను పోలీసులు విధిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ (Pandit Nehru Bus stand) నుంచి గన్నవరం (Gannavaram), ఆటోనగర్ (Autonagar) రాక పోకలు సాగించే సిటీ సర్వీసులను 5వ నెంబరు రూట్ మీదగా మళ్లించనున్నారు. మేరీ మాత ఉత్సవాల కోసం బస్టాండ్ నుంచి ప్రత్యేక సిటీ సర్వీసులు నిర్వహించనున్నారు. 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ వరకూ గుణదల పడవల రేవు జంక్షన్ నుంచి ఈఎస్ఐ జంక్షన్ వరకూ ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదు. ఆటోలకు సైతం మాచవరం డౌన్ వరకే అనుమతి ఇవ్వనున్నారు. మేరీ మాత ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం 6 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.

Updated Date - 2023-02-08T08:30:38+05:30 IST