Krishna Dist.: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2023-06-17T12:58:00+05:30 IST

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాని అరికట్టాలంటూ నాగాయలంక తహశీల్దార్ కార్యాలయ ముట్టడికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పిలుపిచ్చారు.

Krishna Dist.: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత..

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాని అరికట్టాలంటూ నాగాయలంక తహశీల్దార్ కార్యాలయం ముట్టడికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad) పిలుపిచ్చారు. ఈ సందర్భంగా నాగాయలంకకు బయలుదేరిన బుద్ధ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. తెలుగుదేశం (TDP) శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుద్ధ ప్రసాద్‌ను ఎక్కించిన జీపు ముందు టీడీపీ కార్యకర్తలు బేటాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కార్యకర్తలను పక్కకు లాగివేసి.. బుద్ధ ప్రసాద్‌ను కోడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Updated Date - 2023-06-17T12:58:00+05:30 IST