Varla Ramaiah: ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలు..

ABN , First Publish Date - 2023-01-02T14:05:44+05:30 IST

అమరావతి: చంద్రన్న కానుక (Chandranna Kanuka) ఓ ఎన్నారై సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని, పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు.

Varla Ramaiah: ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలు..

అమరావతి: చంద్రన్న కానుక (Chandranna Kanuka) ఓ ఎన్నారై (NRI) సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని, పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ముందుగానే వచ్చి సభా స్థలాన్ని పరిశీలించారని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు చనిపోయారా? లేక వారిని చంపేశారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆ కుట్ర కోణాన్ని సీఎం జగన్‌ (CM Jagan) బహిర్గతం చేయాలన్నారు. వాళ్లను సీఎం, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) సభలకు ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తన ప్రసంగం ముగించుకుని అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈ ఘటన జరిగిందని వర్ల రామయ్య అన్నారు. నిన్న గుంటూరు (Guntur) సభలో అధికార పార్టీ స్లీపర్ సెల్స్ (Sleeper Cells) ఉన్నారనే అనుమానం ఉందన్నారు. గుంటూరు సభలో తొక్కిసలాట జరుగుతుందని ముందే సీఎం, వైసీపీ (YCP) నేతలకు తెలుసునని, చంద్రబాబు సభలకు జనం లేకుండా చేయడానికి వైసీపీ ఆడిన కుట్ర అని అన్నారు. వైసీపీ వాళ్లకు ముగ్గురు చనిపోతారని ముందే తెలుసు కాబట్టి ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో మంత్రులు వరుస క్రమంలో హాస్పిటల్ దగ్గరికి వచ్చారన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే గుంటూరు ఘటనపై సీబీఐతో విచారించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-02T14:05:47+05:30 IST