TDP.. జగన్ రెడ్డీ ఇంకెన్నాళ్ళు ఈ కుళ్లు ఆలోచనలు: టీడీపీ బీసీ సెల్

ABN , First Publish Date - 2023-09-06T15:48:44+05:30 IST

అమరావతి: యువగళం వాలంటీర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో బీసీ శ్రేణులు నిరసన తెలుపుతూ.. విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు.

TDP.. జగన్ రెడ్డీ ఇంకెన్నాళ్ళు ఈ కుళ్లు ఆలోచనలు: టీడీపీ బీసీ సెల్

అమరావతి: యువగళం వాలంటీర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ (TDP BC Cell) ఆధ్వర్యంలో బీసీ శ్రేణులు నిరసన (Protest) తెలుపుతూ.. విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి (Veeranki Venkata Gurumurthy) మాట్లాడుతూ జగన్ (Jagan) పాదయాత్ర (Padayatra)కు చంద్రబాబు (Chandrababu) పూర్తి భద్రత కల్పించారని, ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రవర్తించినట్లు జగన్ పాదయాత్ర సమయంలో మేము అలాగే చేస్తే ఆయన నడిచేవారా? అని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూడలేక దాడులు చేస్తున్నారని, వైసీపీ రౌడీల దాడి హేయమైన చర్య అని అన్నారు.

బాధితులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం సిగ్గు సిగ్గని వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. రెండు వందల మంది వైసీపీ (YCP) రౌడీలు చేసిన దాడి కనిపించదా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. వైసీపీ రౌడీలు రాళ్ళు, సోడా బాటిళ్లతో దాడి చేశారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రెచ్చగొట్టి, దాడి చేసిన వారిపై చర్యలు ఎక్కడని నిలదీశారు. జగన్ రెడ్డీ ఇంకెన్నాళ్ళు ఈ కుళ్లు ఆలోచనలు.. ఇంకెన్నాళ్ళు ఈ కుట్ర రాజకీయాలు.. అరెస్టు చేసిన యువగళం వాలంటీర్లను తక్షణమే విడుదల చేయాలని వీరంకి వెంకట గురుమూర్తి డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-06T15:48:44+05:30 IST