Karnataka: చంద్రబాబు అక్రమ అరెస్టుపై బెంగళూరులో నిరసనలు

ABN , First Publish Date - 2023-09-15T15:16:56+05:30 IST

బెంగళూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుతో మేమూ అంటూ శుక్రవారం జయనగర్‌లోని వినాయకస్వామి ఆలయంలో తెలుగు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Karnataka: చంద్రబాబు అక్రమ అరెస్టుపై బెంగళూరులో నిరసనలు

బెంగళూరు: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుతో మేమూ అంటూ శుక్రవారం జయనగర్‌లోని వినాయకస్వామి ఆలయంలో (Vinayaka Swamy Temple) తెలుగు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ పూజలు జరిపారు. అనంతరం చంద్రబాబుకు సంఘీభావంగా ర్యాలీ (Rally) నిర్వహించారు. బెంగళూరులో తెలుగుదేశం ఫోరం, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చంద్రబాబును అరెస్టు చేసి కోర్టుకు తరలించే సమయంలో కూడా ఐటీ నిపుణులు (IT Professionals) కలిసి ఫ్రీడమ్ పార్కు (Freedom Park)లో నిరసనలు తెలిపారు. తర్వాత దీక్షలు కూడా చేపట్టారు. శుక్రవారం చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని కోరుతూ వినాయకస్వామి ఆలయంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి (YCP Govt) వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - 2023-09-15T15:27:43+05:30 IST