Jagan Govt.: మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన జగన్ సర్కార్
ABN , First Publish Date - 2023-08-01T15:11:46+05:30 IST
అమరావతి: జగన్ సర్కార్ మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చింది.
అమరావతి: జగన్ సర్కార్ (Jagan Sarkar) మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) వద్ద సెక్యూరిటీ బాండ్ల (Security Bonds) వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చింది. రూ. వెయ్యి కోట్లు పది సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీ.. మరో రూ. వెయ్యి కోట్లు 17 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీ.. ఇంకో రూ. వెయ్యి కోట్లు 20 ఏళ్లకు 7.44 శాతం వడ్డీతో రుణం తెచ్చింది.
ఎఫ్ఆర్బీఎం (FRBM) కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఇచ్చిన రూ. 30 వేల 500 కోట్ల రుణం నాలుగు నెలల్లోనే పూర్తి చేశారు. వంద రోజుల్లోనే బాండ్ల వేలం ద్వారా జగన్ ప్రభుత్వం రూ. 30 వేల 500 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం తెచ్చిన అప్పులో రూ. 2 వేల కోట్లు తాజాగా కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితి.. ఈ డబ్బుతో సామాజిక భద్రతా పెన్షన్లు 60 శాతం వరకూ బుధవారం పంపిణీ చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు మరో రూ. 5 వేల 500 కోట్ల రూపాయలు అవసరముంది. జీతాలు ఇచ్చేందుకు అప్పు కోసం ప్రభుత్వం వెతుకుతోంది.