Ramakrishna: ‘డాక్టర్ అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ జరపాలి’

ABN , First Publish Date - 2023-03-27T09:10:55+05:30 IST

కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

Ramakrishna: ‘డాక్టర్ అచ్చన్న మృతిపై  సమగ్ర విచారణ జరపాలి’

అమరావతి: కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ... 13 రోజుల అదృశ్యానంతరం డాక్టర్ అచ్చన్న అనుమానాస్పద మృతి చెందడం బాధాకరమన్నారు. దళిత వైద్యుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పలువురు సిబ్బందితో తన తండ్రికి ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్ అచ్చన్న కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యమన్నారు. సీఎం సొంత జిల్లా కడపలోనే దళితులకు రక్షణ లేకుండాపోతోందని మండిపడ్డారు. మాస్కులు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేసి మట్టుబెట్టిందని అన్నారు. డాక్టర్ అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-27T09:10:55+05:30 IST