AP News: వైసీపీ ప్రభుత్వంపై పీతల సుజాత ఫైర్

ABN , First Publish Date - 2023-04-22T20:19:16+05:30 IST

ఎర్రగొండపాలెంలో టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పై జరిగిన దాడిని మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujata) ఖండించారు.

AP News: వైసీపీ ప్రభుత్వంపై పీతల సుజాత ఫైర్

విజయవాడ: ఎర్రగొండపాలెంలో టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పై జరిగిన దాడిని మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujata) ఖండించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ (Jagan) ఆధ్వర్యంలో ఉన్న ఐప్యాక్ టీమ్ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) ద్వారా అమలు పరిచారని అన్నారు. పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే... ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ ఓర్వలేకే ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దళితుల్లో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. దళితుల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చి చివరకు వారికే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ దిగజారి మరీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అర్దనగ్న ప్రదర్శన ఒక ఫ్యాషన్‌గా మారిందన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో తాకట్టుపెట్టారని విమర్శించారు. పదవి కాపాడుకోవడానికి చివరకు అర్దనగ్న ప్రదర్శన చేసి మీ విలువను దిగజార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని చూసి దళితులు అందరూ బాధపడుతున్నారని, అది మీకు సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-04-22T20:19:19+05:30 IST