Somireddy: ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారు...

ABN , First Publish Date - 2023-03-18T14:35:39+05:30 IST

కడప: ఎందరో నియంతలు (Dictators) మట్టిలో కలిసిపోయారని.. ఇక జగన్ రెడ్డి (Jagan reddy)ని కూడా జనం మట్టిలో కలుపుతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Somireddy: ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారు...

కడప: ఎందరో నియంతలు (Dictators) మట్టిలో కలిసిపోయారని.. ఇక జగన్ రెడ్డి (Jagan reddy)ని కూడా జనం మట్టిలో కలుపుతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan reddy) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో 108 నియోజక వర్గాలల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ (TDP) గెలిచిందన్నారు.

ఇక పశ్చిమ రాయలసీమ స్థానంలో రాంగోపాల్ రెడ్డి (Ramgopal Reddy) గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘మా అభ్యర్థి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు.. 175 కు 175 స్థానాల్లో గెలుస్తామని చెప్పిన సీఎం జగన్‌కు పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు.. ప్రతిపక్షం ఉండకూడదని చెప్పారు.. ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటున్నాము.. మేము 155 అంటున్నాము.. మీలా నియంతలా 175 అని టీడీపీ మాట్లాడటం లేదు.. అడవుల్లో జంతువులుగా ఒంటరిగా వస్తామనే మంత్రుల నోర్లు ఇప్పుడు మూసుకున్నాయి.. ఇకనైనా క్రూయల్ రాజకీయాలు మానుకుని, నిజమైన ప్రజాసేవ చేయండి.. విశాఖ రాజధాని వద్దంటూ చదువుకున్న పట్టభద్రులు మంచి తీర్పు ఇచ్చారు.. మీ పిచ్చి రాజకీయాలకు, చర్యలకు ఇది చెంప పెట్టు..’’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-03-18T14:35:39+05:30 IST