Share News

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

ABN , Publish Date - Dec 18 , 2023 | 09:59 AM

అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

 Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు.. అలాగే వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 15వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా ఎస్పీ రామ్ సింగ్ వేధించారని, సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా సీబీఐ చెప్పినట్లు నడుచు కోవాలని తనను బెదిరించినట్లు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన పులివెందుల కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు ఈ ముగ్గురుపై కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 09:59 AM