Jogi Ramesh :14 ఏళ్లలో ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా?

ABN , First Publish Date - 2023-04-19T14:22:11+05:30 IST

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు.

Jogi Ramesh :14 ఏళ్లలో ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా?

గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు. అధికారంలోకి రాగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని జోగి రమేష్ పేర్కొన్నారు. ఇంత మంచి చేస్తుంటే శిఖండిలా చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టులకు వెళ్తున్నారన్నారు. సెల్ఫీలు దిగి ట్వీట్ చేసి తాము కట్టించినవిగా చెప్పుకుంటున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ గడప వద్దకు వెళ్లయినా14 ఏళ్లలో ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు నిలబెట్టగలరా..? అని నిలదీశారు. మే నెలాఖరుకు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని జోగి రమేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-19T14:22:11+05:30 IST