Share News

AP News: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-12-11T11:35:14+05:30 IST

Andhrapradesh: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

AP News: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అరెస్ట్

అమరావతి: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ను (Janasena Corporator Peethala Murthy Yadav) పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు మూర్తి యాదవ్‌ను అడ్డుకున్నారు. కౌన్సిల్ సమావేశానికి హాజరుకావలిసిన ఉందని తెలిపినా కూడా విచక్షణారహితంగా అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ బారక్స్‌లోని కల్యాణ మండపానికి జనసేన నేతను తరలించారు.


ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చెప్పుకునే హక్కు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. విశాఖ ఎంపీ ఎంవీవీ, వైసీపీ నేతలు ప్రతిపక్షాల పోలీసులను ప్రయోగించి దాడి చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అని అన్నారు. దీనికి వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ప్రజా క్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Updated Date - 2023-12-11T11:35:15+05:30 IST