Pawan Kalyan: జాతీయ ఛానెల్స్‌లో పవన్‌పై న్యూస్.. జనసేనాని రియాక్షన్ ఏంటంటే?

ABN , First Publish Date - 2023-10-05T15:18:40+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారంటూ జాతీయ న్యూస్ ఏజెన్సీల్లో వస్తున్న వార్తలు ఆ పార్టీలో కలవరాన్ని రేపుతున్నాయి. ఈ వార్తల సమాచారాన్ని మచిలీపట్నంలో ఉన్న పవన్‌ దృష్టికి జనసేన నేతలు తీసుకెళ్లారు.

Pawan Kalyan: జాతీయ ఛానెల్స్‌లో పవన్‌పై న్యూస్.. జనసేనాని రియాక్షన్ ఏంటంటే?

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Janasena Chief Pawan Kalyan) ఎన్‌డీఏ (NDA) నుంచి బయటకు వచ్చారంటూ జాతీయ న్యూస్ ఏజెన్సీల్లో (National Media Channels) వస్తున్న వార్తలు ఆ పార్టీలో కలవరాన్ని రేపుతున్నాయి. ఈ వార్తల సమాచారాన్ని మచిలీపట్నంలో ఉన్న పవన్‌ దృష్టికి జనసేన నేతలు తీసుకెళ్లారు. అయితే ప్రతీ వార్తకి ఎక్కడ స్పందిస్తామని జనసేనాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిన్న (బుధవారం) పెడన సభలో తాను ఎన్‌డీఏ నుంచి ఒక అడుగు బయటకు వచ్చి టీడీపీతో (Janasena-TDP Alliance) పొత్తు పెట్టుకున్నానని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


తెలుగుదేశంతో జనసేన పొత్తుకు ఎన్‌డీఏ ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నానని సభలో ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో కలిసి ఏపీలో ఉన్న పరిస్థితులను వివరించి టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా చెబుతానని జనసేన అధినేత చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతుందని పవన్‌ ఇప్పటికే ప్రకటించగా.. ఈరోజు (గురువారం) ముదినేపల్లి సభలో మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-10-05T15:24:56+05:30 IST