Yuvagalam Padayatra: జగన్‌మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2023-05-12T20:01:02+05:30 IST

జగన్‌మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే. అబద్దాలు, మోసం, నయవంచన కలిసిన మానవరూపాన్ని సీఎం జగన్‌ (CM Jagan) అంటారు..

Yuvagalam Padayatra: జగన్‌మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే: నారా లోకేశ్‌

నంద్యాల: ‘‘జగన్‌మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే. అబద్దాలు, మోసం, నయవంచన కలిసిన మానవరూపాన్ని సీఎం జగన్‌ (CM Jagan) అంటారు’’ అని నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు. నందికొట్కూరు నియోజకవర్గం (Nandikotkur Assembly constituency)లో లోకేశ్‌ పాదయాత్ర పూర్తైంది. శ్రీశైలం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. శ్రీశైలం నియోజకవర్గంలో లోకేశ్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ కరివేనులోని ఆగ్రిగోల్డ్ ఆస్తులను తాము బినామీ పేర్లతో కొట్టేశామని, జగన్ అబద్దపు ప్రచారంతో మాపై విషం చిమ్మారని తెలిపారు. అగ్రిగోల్డ్ (Agrigold) బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, 4 ఏళ్లు దాటిపోయినా జగన్ మాట నిలబెట్టుకోలేదని తప్పుబట్టారు. 6 నెలల్లో న్యాయం చేయడమంటే వారం రోజుల్లో.. సీపీఎస్ రద్దు చేసిన మాదిరిగానేనా జగన్‌ మోసపురెడ్డీ? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-05-12T20:01:12+05:30 IST