Share News

AP HighCourt: ఏయూలో నిధుల మళ్లింపు, అవినీతిపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2023-11-29T13:18:18+05:30 IST

Andhrapradesh: ఆంధ్ర యూనివర్సిటీలో నిధుల మళ్లింపుతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వీసీ ప్రసాద్ రెడ్డి తదితరులపై విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది.

AP HighCourt: ఏయూలో నిధుల మళ్లింపు, అవినీతిపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఆంధ్ర యూనివర్సిటీలో (Andhra University) నిధుల మళ్లింపుతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వీసీ ప్రసాద్ రెడ్డి (VC Prasad Reddy) తదితరులపై విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. నోటిఫకేషన్ లేకుండా పోస్టుల భర్తీ చేపట్టారని యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అక్రమ నియామకాలు చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. గవర్నర్ తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విచారణను ఎనిమిది వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-29T13:18:19+05:30 IST