TDP leader Pattabhiram: హైకోర్టు వ్యాఖ్యలు సీఎం జగన్ చెవికి ఎక్కలేదా?

ABN , First Publish Date - 2023-01-20T17:51:50+05:30 IST

ఏపీలో సలహాదారుల వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, సలహాదారుల్లో రెడ్లకే అధిక ప్రాధాన్యం ఎందుకిచ్చాడు?

TDP leader Pattabhiram: హైకోర్టు వ్యాఖ్యలు సీఎం జగన్ చెవికి ఎక్కలేదా?

గుంటూరు: ఏపీలో సలహాదారుల వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, సలహాదారుల్లో రెడ్లకే అధిక ప్రాధాన్యం ఎందుకిచ్చాడు? అని టీడీపీ నేత పట్టాభిరామ్ (TDP leader Pattabhiram) ప్రశ్నించారు. సలహాదారుల నియామకం ప్రమాదకరమన్న హైకోర్టు వ్యాఖ్యలు సీఎం జగన్ (Jagan) చెవికి ఎక్కలేదా? అని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. సజ్జల మొదలు సలహాదారుల జాబితా 100కు పైనే ఉందని, సలహాదారులకు లక్షల్లో జీతాలు, ఉద్యోగులకు జీతాలు లేవని పట్టాభిరామ్‌ ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం సలహాదారులు ఏం చేస్తున్నారో జగన్‌రెడ్డి చెప్పాలని పట్టాభిరామ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-01-20T18:00:42+05:30 IST