TDP MLC Manthena: జగన్‌రెడ్డిదే డబుల్ ఐరన్ లెగ్

ABN , First Publish Date - 2023-01-28T17:58:08+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి( cm jagan Reddy) దే డబుల్ ఐరన్ లెగ్ అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు (Mantena Satyanarayana Raju ) అన్నారు.

TDP MLC Manthena: జగన్‌రెడ్డిదే డబుల్ ఐరన్ లెగ్

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి( cm jagan Reddy)దే డబుల్ ఐరన్ లెగ్ అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు(Mantena Satyanarayana Raju ) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) అస్వస్థతపై వైసీపీ నేతల(YCP Leaders) నీచ రాజకీయం సిగ్గుచేటన్నారు. సొంతబాబాయిని చంపిన వారికి శవ రాజకీయాలు కొత్త కాదన్నారు.జబర్దస్త్ లో డాన్సులు, రాజకీయాల్లో బూతులు తప్ప వైసీపీ మంత్రి రోజా(YCP minister Roja)కు ఇంకేం తెలుసు? అని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర(Lokesh Padayatra)కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర పూర్తయ్యే లోపు వైసీపీ నేతలు వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఇతర దేశాలకు పారిపోక తప్పదని మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు.

Updated Date - 2023-01-28T18:00:47+05:30 IST