Bopparaju Venkateswarlu: రెవెన్యూ ఉద్యోగులపై పని భారం తగ్గించాలి

ABN , First Publish Date - 2023-09-12T16:06:35+05:30 IST

వెన్యూ ఉద్యోగుల(Revenue Employees)పై పని భారం తగ్గించాలని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Bopparaju Venkateswarlu: రెవెన్యూ ఉద్యోగులపై పని భారం తగ్గించాలి

ప్రకాశం: రెవెన్యూ ఉద్యోగుల(Revenue Employees)పై పని భారం తగ్గించాలని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రమైన పని వత్తిడి ఉంది. ఉద్యోగాలు పని చేయలేక స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామాల్లో రీసర్వే 15 రోజుల్లో పూర్తి చేయాలని వత్తిడి చేస్తున్నారు. కొంత మంది కలెక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించి రెవెన్యూ ఉద్యోగులపై పని భారం పెడుతున్నారు.ఎన్నికల ప్రక్రియ వత్తిడి మొత్తం కలెక్టర్లు, జేసీలు రెవెన్యూ ఉద్యోగులపై పెడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో చిన్న చిన్న తప్పులు జరిగితే ఉద్యోగుల జీవితాలు ఏమైపోతాయో తెలియదని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-12T16:06:35+05:30 IST