Bopparaju Venkateshwarlu: ఎప్పుడు జీపీఎస్‌ను వ్యతిరేకించలేదు

ABN , First Publish Date - 2023-08-29T16:55:00+05:30 IST

ఎప్పుడు జీపీఎస్‌(GPS)ను వ్యతిరేకించలేదు.... సీపీఎస్‌(CPS)ను మాత్రమే వ్యతిరేఖించామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateshwarlu) తెలిపారు.

Bopparaju Venkateshwarlu:  ఎప్పుడు జీపీఎస్‌ను వ్యతిరేకించలేదు

అమరావతి: ఎప్పుడు జీపీఎస్‌(GPS)ను వ్యతిరేకించలేదు.... సీపీఎస్‌(CPS)ను మాత్రమే వ్యతిరేఖించామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateshwarlu) తెలిపారు. మంగళవారం నాడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. జీపీఎస్‌లో రిటైర్ అయ్యేనాటికి బేసిక్‌లో 50 శాతం పెన్షన్ ఉంటుందని చెపుతున్నారన్నారు.ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం9YCP GOVT) చెపుతోందన్నారు . ఈరోజు జీపీఎస్‌ విధి విధానాలపై ప్రభుత్వం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ప్రభుత్వం ఏం చేపుతుందో చూస్తాం.. మా ప్రతిపాదనలు మేము ప్రకటిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ కోసం తమ విజ్జప్తులు తెలిపినట్లు చెప్పారు.జీపీఎస్‌లో ఇంకా ఏం కావాలో చెప్పాలని కోరాం వారి నుంచి ఇన్ ఫుట్స్ తీసుకున్నట్లు బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2023-08-29T16:55:00+05:30 IST