Ambati Rayudu: ‘ఆడుదాం ఆంధ్ర’ పోగ్రామ్కు అంబటి రాయుడు దూరం
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:15 PM
‘ఆడుదాం ఆంధ్ర’ పోగ్రామ్కు క్రికెటర్ అంబటి రాయుడు దూరంగా ఉండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. నేడు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనలో అంబటి రాయుడు కనిపించలేదు. గత కొంతకాలంగా గుంటూరు పార్లమెంట్లో రాయుడుని వైసీపీ తిప్పుతోంది.
గుంటూరు : ‘ఆడుదాం ఆంధ్ర’ పోగ్రామ్కు క్రికెటర్ అంబటి రాయుడు దూరంగా ఉండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. నేడు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనలో అంబటి రాయుడు కనిపించలేదు. గత కొంతకాలంగా గుంటూరు పార్లమెంట్లో రాయుడుని వైసీపీ తిప్పుతోంది. క్రీడలకు సంబంధించిన కీలక కార్యక్రమానికి రాయుడు డుమ్మా కొట్టారు. అంబటి రాయుడు గౌర్హజరుపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన కార్యక్రమం కావడంతో ఆయన తప్పక ఉంటారని అంతా భావించారు. సీఎం జగన్ పర్యటన కన్నా ఇప్పుడు అంబటి రాయుడు గైర్హాజరుపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏపీలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవని తెలిసి ఆయన కావాలనే డుమ్మా కొట్టారా? అనేది చర్చనీయాంశంగా మారింది.