Bandaru Satyanarayana: నాపై కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడింది

ABN , First Publish Date - 2023-10-04T14:41:23+05:30 IST

తనపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

Bandaru Satyanarayana: నాపై కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడింది

అమరావతి: తనపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Former Minister Bandaru Satyanarayana Murthy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉరిశిక్షకైనా సిద్ధం తప్ప దుర్మార్గపు చర్యలతో జగన్మోహన్ రెడ్డి (CM Jganamohan Reddy) తమను భయపెట్టలేరన్నారు. ఉండే నాలుగు మాసాలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిదని హితవుపలికారు. ‘‘నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరం’’గా ఉందన్నారు. మహిళలంటే తనకెంతో గౌరవమన్నారు. గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా (Minister Roja) ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని అన్నారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని తెలిపారు. రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కూడా విశ్లేషించుకోవాలని బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు.

Updated Date - 2023-10-04T16:04:48+05:30 IST